బెల్లంపల్లిలో బీఆర్ఎస్వీ ఆందోళన..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన బామ్మర్ది ఇళ్ల పై సోదాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో సోమవారం ఆందోళన చేశారు.

Update: 2024-10-28 09:56 GMT

దిశ, బెల్లంపల్లి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన బామ్మర్ది ఇళ్ల పై సోదాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో సోమవారం ఆందోళన చేశారు. బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద బీఆర్ఎస్వీ ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ సోదా చేసిన పోలీసులు, కేటీఆర్ ఇంటి పై దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కేటీఆర్ పై దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ కు తెరాలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటి పై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు అరుణ్, రోషన్, ప్రసాద్, కిరణ్, సంతోష్, రాజు కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News