ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని బీజేపీ దక్షణ మధ్య రైల్వే బోర్డ్ సభ్యులు జీవీ రమణ అన్నారు.

Update: 2023-02-21 10:56 GMT

దిశ, ఇచ్చోడ : ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని బీజేపీ దక్షణ మధ్య రైల్వే బోర్డ్ సభ్యులు జీవీ రమణ అన్నారు. మండలంలోని గుండాల గ్రామంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా గోస.. బీజేపీ భరోసా స్ర్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యో గ అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు.

మోస పూరిత వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మానాజీ, శక్తి కేంద్రం ఇంచార్జీ ముస్లే అశోక్, బూత్ అధ్యక్షులు సిరాజ్, మండల అధ్యక్షులు కేంద్రే నారయణ, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు జాదవ్ రాము, మైనారిటీ మోర్చ మండల అధ్యక్షులు ఖదీర్, రఫిక్, కమిటీల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News