చెరుకు సుధాకర్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తే చంపేస్తాం అనడం దారుణం..

టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణా ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తే చంపేస్తామని ఎంపీ.కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం చాలా దారుణం అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు.

Update: 2023-03-06 09:56 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణా ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ గౌడ్ ప్రజల్లోకి వెళ్తే చంపేస్తామని ఎంపీ.కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం చాలా దారుణం అని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు.

సోమవారం నిర్మల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లో బీసీ నాయకులు ఎదగక పోవడానికి ఇది నిదర్శనం అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ నాయకులకు సరైన పదవులు రావడం లేదని ఒకవేళ వస్తే ఇటువంటి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆయన పేర్కన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని అన్నారు. బీసీ నాయకుల జోలికి వస్తే ఊరుకోమన్నారు.

Tags:    

Similar News