దంత వైద్యుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు హఠాన్మరణం.. కారణం ఇదే..!

దంత వైద్యుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏ.నవీన్ కుమార్ హఠాన్మరణం చెందారు.

Update: 2024-09-17 07:27 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ : దంత వైద్యుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏ.నవీన్ కుమార్ హఠాన్మరణం చెందారు. నిర్మల్ జిల్లాలో దంత వైద్య సేవలు ప్రారంభించిన తొలితరం వైద్యుడిగా ఆయనకు పేరుంది. కుటుంబంతో కలిసి గోవా టూర్‌లో ఉన్న డాక్టర్ నవీన్‌కు తెల్లవారుజామున తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడ ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన సతీమణి డాక్టర్ నమిత కూడా ప్రముఖ వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. డాక్టర్ నవీన్ మృతి పట్ల నిర్మల్ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ చక్రధారి, డాక్టర్ దామెర రాములు, డాక్టర్ సుభాష్ రావు, డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ రమణా గౌడ్, డాక్టర్ దేవేందర్ రెడ్డి, ప్రమోద్ చందర్ రెడ్డి, డాక్టర్ బి.సురేష్ కుమార్, డాక్టర్ రమేష్ తదితరులు సంతాపం ప్రకటించారు.


Similar News