గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్సీ దండే విటల్

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ

Update: 2024-10-11 14:46 GMT

దిశ, బెజ్జూర్ : గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండేవిటల్ అన్నారు. శుక్రవారం మండలంలోని సోమిని కృష్ణ పల్లి గ్రామాల మధ్య కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్ల మరమ్మత్తుల కోసం రూపాయలు మూడు కోట్లు నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు చేపడుతామని పేర్కొన్నారు.

అనంతరం సోమిని ఆశ్రమ పాఠశాలలో వాలీబాల్ క్రీడలు ముగింపు కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల సాంబయ్య కుటుంబాల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ అర్షద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్, మాజీ జడ్పీటీసీ పుష్పలత నాయకులు నాహీర్ అలీ, రేణిగుంట్ల పెంటయ్య, రాజేష్ సురేష్ గౌడ్ సామల రాజన్న తదితరులు ఉన్నారు.


Similar News