ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ లో 6928 మందికి సీట్లు

బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగిసింది.

Update: 2024-09-27 17:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఈడీ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగిసింది. సెకండ్ ఫేజ్ లో 9616 సీట్లు అందుబాటులో ఉండగా.., 11,087 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇంఉలో 6928 మందికి సీట్లు అలాట్ చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు. కాగా, ఫస్ట్ ఫేజ్​లో 9817 మందికి సీట్లు అలాట్ అయితే, 4841 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్టు చేశారు. కాగా, సెకండ్ ఫేజ్​లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈనెల 30లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని రమేశ్ బాబు సూచించారు.


Similar News