‘ఆ మంత్రులకు బాబు భయం పట్టుకుంది..’

దిశ, సంగారెడ్డి : రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భయం పట్టుకుందని టీడీపీ మెదక్ పార్లమెంటు అధ్యక్షుడు ఇల్లేందుల రమేష్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పై తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని, లేనట్లయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కరోనా బాధితులను ఆదుకోవడం మరచి, బాబును విమర్శించడం తగదన్నారు. చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశం పార్టీ నేతల్లోనూ ఉత్సాహం నింపిందని […]

Update: 2021-07-11 08:53 GMT

దిశ, సంగారెడ్డి : రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భయం పట్టుకుందని టీడీపీ మెదక్ పార్లమెంటు అధ్యక్షుడు ఇల్లేందుల రమేష్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పై తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని, లేనట్లయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కరోనా బాధితులను ఆదుకోవడం మరచి, బాబును విమర్శించడం తగదన్నారు. చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశం పార్టీ నేతల్లోనూ ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తామని తెలిపారు.

Tags:    

Similar News