‘పోయిన ప్రాణాలు తీసుకొస్తావా జగన్’

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మొన్న రెండు బిల్లులతో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని విమర్శించారు. దీంతో రాజధాని కోసం 60 సెంట్లిచ్చిన సామ్రాజ్యం అనే మహిళా రైతు గుండె ఆగిపోయిందని దేవినేని గుర్తు చేశారు. ఈ తరహాలోనే అమరావతి కోసం 2 ఎకరాలు ఇచ్చిన వెంకటేశ్వరరావు గుండె ఆగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పిడి పేరుతో రైతులు, ప్రజల […]

Update: 2020-08-02 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. మొన్న రెండు బిల్లులతో రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని విమర్శించారు. దీంతో రాజధాని కోసం 60 సెంట్లిచ్చిన సామ్రాజ్యం అనే మహిళా రైతు గుండె ఆగిపోయిందని దేవినేని గుర్తు చేశారు.

ఈ తరహాలోనే అమరావతి కోసం 2 ఎకరాలు ఇచ్చిన వెంకటేశ్వరరావు గుండె ఆగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పిడి పేరుతో రైతులు, ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని దేవినేని ఉమ మండిపడ్డారు. ఏం చేసినా పోయిన ప్రాణాలను తీసుకొస్తారా అంటూ జగన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మృతుల ఫోటోలను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags:    

Similar News