Yuzvendra Chahal: కౌంటీ క్రికెట్ ఆడనున్న చాహల్!
టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్ ఆడనున్నట్టు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్ ఆడనున్నట్టు తెలుస్తోంది. భారత వరల్డ్ కప్ జట్టులో చాహల్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లో జరగనున్న కౌంటీ చాంపియన్షిప్ టోర్నీలో ఆడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ‘కెంట్ క్రికెట్ క్లబ్’ తరఫున ఆడనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ టోర్నీలో చాహల్ మొత్తం మూడు మ్యాచ్లు ఆడనుండగా, ఒక్కో మ్యాచ్ నాలుగు రోజులపాటు జరగనుంది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి చాహల్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్వోసీ) సైతం అందుకున్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గవర్నింగ్ బాడీలోని అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ త్వరలో విడుదల చేయనుంది. ఈ క్లబ్ కోసం చాహల్ నాలుగు రోజుల మ్యాచ్లు మూడు ఆడనున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అతనికి ఎన్ఓసీ మంజూరు చేసింది. అతను భారత జట్టుకు అవసరమైతే వెంటనే చేరతాడు’’ అని వెల్లడించారు.