నితీశ్‌ కుమార్ బ్యాడ్‌లక్.. అతని స్థానంలోకి శివమ్ దూబె

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా జట్టులో స్థానం కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న వైజాగ్ కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి లక్కు చిక్కినట్లే చిక్కి మరోసారి మిస్ అయ్యింది.

Update: 2024-06-27 16:01 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా జట్టులో స్థానం కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న వైజాగ్ కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి లక్కు చిక్కినట్లే చిక్కి మరోసారి మిస్ అయ్యింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా జట్టులో తొలుత చోటు దక్కించుకున్న నితీశ్.. గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో శివమ్ దూబె జింబాబ్వే పర్యటనకు వెళ్తున్నట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా జింబాబ్వేతో 5 టీ20ల మ్యాచ్ ఆడనుంది. అయితే, హెర్నియా గాయం కారణంగానే నితీశ్ కుమార్ జింబాబ్వే పర్యటనకు దూరమైనట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున నితీశ్ కుమార్ 303 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కాగా, జూలై 6వ తేదీన జింజాబ్వేతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది.


Similar News