డబ్ల్యూటీటీ టోర్నీలో ఫైనల్కు చేరుకున్న తెలుగమ్మాయి శ్రీజ
డబ్ల్యూటీటీ కంటెండర్ లాగోస్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి, భారత స్టార్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది.
దిశ, స్పోర్ట్స్ : నైజీరియాలో జరుగుతున్న డబ్ల్యూటీటీ కంటెండర్ లాగోస్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి, భారత స్టార్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్లో శ్రీజ 3-2(11-8, 13-15, 11-9, 9-11, 12-1) తేడాతో సహచర క్రీడాకారిణి సుతీర్థ ముఖర్జీని ఓడించి ఫైనల్ దూసుకెళ్లింది. టైటిల్ పోరులో చైనా ప్లేయర్ డింగ్ యిజీతో తలపడనుంది. మహిళల డబుల్స్లోనూ శ్రీజ సత్తాచాటింది. అర్చన కామత్తో కలిసి ఫైనల్కు చేరుకుంది. సెమీస్లో శ్రీజ జోడీ 3-0(11-7, 11-5, 12-10) తేడాతో మరో భారత జంట ఐహికా ముఖర్జీ-సుతీర్థ ముఖర్జీపై విజయం సాధించింది. ఫైనల్లోనూ భారత్కే చెందిన యశస్విని-దియా పరాగ్ జోడీని ఎదుర్కోనుంది. పురుషుల డబుల్స్లో హర్మీత్ దేశాయ్-మానవ్ వికాస్ జోడీ కూడా ఫైనల్కు చేరుకుంది.