దిశ, వెబ్డెస్క్: WTC Final 2023లో భాగంగా మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 44 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్స్లో.. లబుషేన్ (4), కామెరాన్ గ్రీన్ (7) పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా 2 వికెట్లు తీయగా.. సిరాజ్ 1 వికెట్ పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ 296 పరుగులు లీడ్లో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్లోపే ఆసీస్ను ఆలౌట్ చేయడానికి టీమిండియా ప్రయత్నించాలి. ఒకవేళ ఆసీస్ 350 కంటే ఎక్కువ ఆధిక్యం సాధిస్తే.. మాత్రం భారత్కు ఓటమి తప్పకపోవచ్చు. నాలుగో రోజు ఆటలో టీమిండియాకు తొలి సెషన్ చాలా కీలకం. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
Stumps on Day 3 of the #WTC23 Final!
— BCCI (@BCCI) June 9, 2023
Australia finish the day with 123/4 as #TeamIndia scalp 3️⃣ wickets in the final session 👌🏻👌🏻
Join us tomorrow for Day 4 action!
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/NzVeXEF0BX