WTC FINAL: కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్.. వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ వైరల్‌

WTC Final 2023లో భాగంగా లండన్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔటైన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Update: 2023-06-11 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా లండన్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔటైన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేశాడని సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటోతో సెహ్వాగ్ ఫన్నీ మీమ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

"శుబ్‌మన్‌ గిల్‌ ఔట్‌ విషయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని నిర్ణయం తీసుకున్నాడు. సరైన ఆధారాలు లేకపోతే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నాటౌటగా ప్రకటించాలి. గిల్‌ది క్లియర్‌గా నాటౌట్‌" అని ట్విటర్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.


Similar News