పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్.. రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది.

Update: 2024-08-07 06:55 GMT

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లోభారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం జరిగిన సెమీస్‌లో వినేశ్ పొగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్‌ను మట్టికరిపించి పైనల్ మ్యాచుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత్ ప్రజలు నిరాశకు గురయ్యారు. కాగా ప్రస్తుతం భారత అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. 

Tags:    

Similar News