హాఫ్ సెంచరీతో మెరిసిన తెలుగమ్మాయి మేఘన.. యూపీ వారియర్స్ ముందు 158 టార్గెట్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Update: 2024-02-24 15:48 GMT

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తెలుగమ్మాయి, ఆంధప్రదేశ్‌కు చెందిన సబ్బినేని మేఘన సత్తాచాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేఘన హాఫ్ సెంచరీతో మెరిసింది. టాస్ ఓడి ముందుగా బెంగళూరు బ్యాటింగ్ ఆరంభించగా ఆ జట్టు 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సోఫి డివైన్(1), కెప్టెన్ స్మృతి మంధాన(13), ఎల్లీస్ పెర్రీ(8) నిరాశపరిచారు. ఈ పరిస్థితుల్లో మేఘన కీలక ఇన్నింగ్స్ ఆడింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆమె 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 బంతుల్లో 53 పరుగులు చేసింది. మేఘనతోపాటు వికెట్ కీపర్ రిచా ఘోష్(62) సైతం హాఫ్ సెంచరీ బాదింది. వీరిద్దరూ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు జట్టు 6 వికెట్లను కోల్పోయి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 158 పరుగులు చేయాల్సి ఉంది. యూపీ బౌలర్లలో రాజేశ్వరి 2 వికెట్లు తీయగా.. గ్రేస్ హారిస్, మెక్‌గ్రాత్, ఎక్లోస్టోన్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. 

Tags:    

Similar News