అలనాటి విండీస్ దిగ్గజంతో భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్

విండీస్‌ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.

Update: 2023-07-05 13:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే కరీబియన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం విండీస్‌ దిగ్గజ ప్లేయర్‌ గ్యారీ సోబర్స్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను అందరిని దగ్గరుండి పరిచయం చేయించాడు. గిల్‌ను పరిచయం చేస్తూ.. మా టీమ్‌లో ఉన్న యంగ్, ఎక్సైటింగ్ ప్లేయర్ ఇతడు అని చెప్పడం విశేషం.

సోబర్స్, అతని భార్య స్టేడియానికి వచ్చారు. తనను కలిసి టీమిండియా క్రికెటర్లందరికీ సోబర్స్ తన భార్యను ప్రత్యేకంగా పరిచయం చేశాడు. గ్యారీ సోబర్స్‌ రోహిత్, విరాట్‌లతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. నిజానికి సోబర్స్ ను కలిసి విరాట్ కోహ్లి.. 2020లో అదే గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉన్న 'మేల్ క్రికెట్ ఆఫ్ ద డెకేడ్' అవార్డు(గ్యారీ సోబర్స్‌ అవార్డు) గెలుచుకున్నాడు. తొలి టెస్ట్ జులై 12న ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే.

ఇండియా టెస్టు టీమ్:

రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ


Similar News