WTC Final 2023: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్..

Update: 2023-06-11 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఐసీసీ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు సచిన్‌ టెండూల్కర్‌ 657 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా కోహ్లి సచిన్‌ను అధిగమించి 660 పరుగులతో లీడింగ్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

డబ్ల్యూటీసీలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై కోహ్లి 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు, అదే సమయంలో టెస్టుల్లోనూ ఆసీస్‌పై 2వేల పరుగులు పూర్తి చేశాడు.


Similar News