నేడు భారత్-జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ జింబాబ్వేతో నాలుగో మ్యాచ్‌లో తలపడనుంది.

Update: 2024-07-13 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ జింబాబ్వేతో నాలుగో మ్యాచ్‌లో తలపడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌కు అనూహ్య రీతిలో షాక్ ఇచ్చిన జింబాబ్వే ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా సిరీస్‌లో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. కాగా, సోని నెట్ వర్క్‌లో ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటల నుంచి ప్రసారం కానుంది.       


Similar News