అతను టెస్టులు ఆడితే భారత్కు తిరుగుండదు : సునీల్ గవాస్కర్
టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి టెస్టుల్లోకి తీసుకరావాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తిరిగి టెస్టుల్లోకి తీసుకరావాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో గవాస్కర్ మాట్లాడుతూ.. పాండ్యా బౌలింగ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రత్యర్థి ఎవరైనా భారత్కు తిరుగుండదన్నాడు. ‘వచ్చే రెండు నెలల్లో తిరిగి టెస్టు క్రికెట్ ఆడేలా హార్దిక్ పాండ్యాను ఒప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తున్నా. అతను 6వ లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేసినా, రోజుకు 10 ఓవర్లు బౌలింగ్ చేసినా భారత్కు ఎంతో ప్రయోజనం. ఎలాంటి పిచ్పైనా అతని బ్యాటింగ్ చేయగలడు. అతను జట్టులో ఉంటే భారత జట్టు టెస్టుల్లోనూ అజేయంగా ఉంటుంది.’ అని తెలిపాడు.
కాగా, ఇటీవల టీ20 వరల్డ్ కప్లో పాండ్యా సత్తాచాటిన విషయం తెలిసిందే. 8 మ్యాచ్ల్లో 144 పరగులు చేయడంతోపాటు 11 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా 2018లో ఇంగ్లాండ్పై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గాయాల కారణంగా అతను టెస్టు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వన్డేలు, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు.