Suryakumar Yadav: టీమిండియా క్రికెట్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..!

టీమిండియా(Team India) ఫాన్స్ కు శుభవార్త.

Update: 2024-09-11 00:12 GMT

దిశ, వెబ్‌డెస్క్:టీమిండియా(Team India) ఫాన్స్ కు శుభవార్త. భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) గాయం నుంచి కోలుకున్నాడని సమాచారం.ఈ నేపథ్యంలో అతడు వచ్చే నెలలో బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరగనున్న టీ20 సిరీస్ కోసం అందుబాటులో ఉంటాడని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా సూర్య బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో చోటే లక్ష్యంగా బుచ్చిబాబు(Buchi Babu) టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. కానీ తొలి మ్యాచ్‌లోనే అతడి కుడి చేతి బొటన వేలికి గాయమైంది.దీంతో బంగ్లాతో టెస్ట్ సిరీస్‌లో ఆడాలన్న అతడి ఆశలన్నీ నిరాశలయ్యాయి.దీంతో అతడు బుచ్చిబాబు టోర్నమెంట్‌తో పాటు దులీప్ ట్రోఫీ(Duleep Trophy) తొలి రౌండ్ మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.

అయితే గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ కోలుకున్నట్లు సమాచారం.బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో సూర్య ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఇటీవల అతడిని బీసీసీఐ వర్గాలు కలిశాయి. అతడు వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్‌సీఏ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.అయితే అంతకంటే ముందే సూర్య సెప్టెంబర్ 12 నుంచి జరిగే దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచుల్లో ఇండియా-సి(India-C) జట్టు తరుపున బరిలోకి దిగనున్నాడు.సూర్య సారథ్యంలోనే టీమిండియా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనుంది.కాగా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో శ్రీలంక(Sri Lanka)తో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో భారత్ 3-0 తేడాతో లంకను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.


Similar News