పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్స్కు సుమిత్
పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ క్వార్టర్స్కు చేరుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : ఇటలీలో జరుగుతున్న పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ క్వార్టర్స్కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో సుమిత్ 0-6, 7-5, 7-6(7-5) తేడాతో ఇటలీ ప్లేయర్ అలెశాండ్రో గియానెస్సీపై పోరాడి గెలిచాడు. మ్యాచ్లో సుమిత్కు పేలవ ఆరంభం దక్కింది. ఒక్క గేమ్ కూడా గెలవకుండా తొలి సెట్ను సమర్పించుకున్నాడు. అనంతరం అతను బలంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఉన్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రెండో సెట్ను గెలుచుకుని మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో సెట్కు మళ్లించాడు. హోరాహోరీగా సాగిన మూడో సెట్ను సుమిత్ టై బ్రేకర్లో నెగ్గి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సుమిత్ పోలాండ్కు చెందిన మాక్స్ కస్నికోవ్స్కీ లేదా బోర్నా కోరిక్(క్రోయేషియా)తో తలపడనున్నాడు.