పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ప్రీక్వార్టర్స్కు సుమిత్
ఇటలీలో జరుగుతున్న పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ ప్రీక్వార్టర్స్కు చేరుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : ఇటలీలో జరుగుతున్న పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ ప్రీక్వార్టర్స్కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 7-6(7-1), 6-2 తేడాతో బోస్నియన్ ఆటగాడు నెర్మాన్ ఫాటిక్ను ఓడించాడు. గంటా 52 నిమిషాలపాటు సాగిన మ్యాచ్ల్లో రెండు సెట్లలోనే విజయం ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్లో ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఆ సెట్ను సుమిత్ టై బ్రేకర్లో నెగ్గాడు. రెండో సెట్ను సుమిత్ ఏకపక్షంగా గెలుచుకుని ముందడుగు వేశాడు. రెండో రౌండ్లో ఇటలీ ప్లేయర్ అలెశాండ్రో గియానెస్సీని సుమిత్ ఎదుర్కోనున్నాడు. కాగా, సుమిత్ ఇటీవలే హెయిల్బ్రోన్ నెకర్కప్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.