పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ప్రీక్వార్టర్స్‌కు సుమిత్

ఇటలీలో జరుగుతున్న పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు.

Update: 2024-06-11 19:22 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇటలీలో జరుగుతున్న పెరుగియా చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ 7-6(7-1), 6-2 తేడాతో బోస్నియన్ ఆటగాడు నెర్మాన్ ఫాటిక్‌ను ఓడించాడు. గంటా 52 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌ల్లో రెండు సెట్లలోనే విజయం ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్‌లో ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఆ సెట్‌ను సుమిత్ టై బ్రేకర్‌లో నెగ్గాడు. రెండో సెట్‌ను సుమిత్ ఏకపక్షంగా గెలుచుకుని ముందడుగు వేశాడు. రెండో రౌండ్‌లో ఇటలీ ప్లేయర్ అలెశాండ్రో గియానెస్సీ‌ని సుమిత్ ఎదుర్కోనున్నాడు. కాగా, సుమిత్ ఇటీవలే హెయిల్‌బ్రోన్ నెకర్‌కప్ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. 


Similar News