గిల్, జైశ్వాల్ ఆ దిగ్గజాలను గుర్తు చేస్తున్నారు : ఊతప్ప

భారత ఓపెనింగ్ జోడీ శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసలు కురిపించాడు.

Update: 2024-07-30 18:14 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత ఓపెనింగ్ జోడీ శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసలు కురిపించాడు. గిల్, జైశ్వాల్ జంట సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లను గుర్తు చేస్తుందని కితాబిచ్చాడు. తాజాగా ఓ క్రీడా చానెల్‌తో ఊతప్ప మాట్లాడుతూ.. ‘నేను వారిద్దరి ఆట చూస్తున్నా. వారిద్దరిని చూస్తున్నప్పుడు గంగూలీ, సచినే గుర్తుకు వస్తున్నారు. వారిద్దరూ పరస్పరం తమ ఆటను మెచ్చుకునే వారు. గిల్, జైశ్వాల్‌లో కూడా అదే చూస్తున్నా. జైశ్వాల్ వన్డే క్రికెట్‌లో అవకాశం పొందితే ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టదు. టెస్టుల్లో, టీ20ల్లో రాణించిన అతనికి వన్డే ఫార్మాట్ సులభమవుతుంది. ఎందుకంటే, పరుగులు తీయడానికి నాకు సమయం ఉందని అతను భావిస్తాడు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, గిల్, జైశ్వాల్ జోడీ 9 ఇన్నింగ్స్‌ల్లో 64.50 సగటుతో 516 పరుగులు చేసింది. మరోవైపు, వన్డే ఫార్మాట్‌లో గంగూలీ-సచిన్ ద్వయం విజయవంతమైన జోడీగా గుర్తుంపు పొందింది. 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ జంట 6,609 పరుగులు చేసింది.


Similar News