కొడుకుకు ధావన్ స్పెషల్ మెసేజ్.. నన్ను అలా గుర్తుంచుకోవాలంటూ ఎమోషనల్

భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు దేశవాళీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2024-08-24 12:55 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు దేశవాళీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. శనివారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కొంతకాలంగా ధావన్ క్రికెట్ కెరీలోనే కాకుండా వ్యక్తిగత జీవితం‌లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టీమ్‌లో స్థానం కోల్పోయిన గబ్బర్.. యువకులు రాణిస్తుండటంతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు, ధావన్ గతేడాది తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. తన కొడుకు జొరావర్ అయేషాతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో తన కొడుకును ఎంతో మిస్ అవుతున్నానంటూ పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తాజాగా రిటైర్మెంట్ సందర్భంగా ధావన్ తన కుమారుడికి స్పెషల్ మెసేజ్ పంపించాడు. తన కొడుకు తనను ఓ క్రికెటర్‌గా కంటే మంచి మనిషిగా గుర్తుంచుకోవాలన్నాడు. ‘జోరావర్‌కు ఇప్పుడు 11 ఏళ్లు. నా కొడుకు నా క్రికెట్ ప్రయాణాన్ని, రిటైర్మెంట్‌ గురించి తెలుసుకోవాలని ఆశిస్తున్నా. కానీ, జొరావర్ నన్ను ఓ క్రికెటర్‌గా కంటే ఓ మంచి మనిషిగా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా.’ అని ఎమోషనల్ అయ్యాడు. 

Tags:    

Similar News