డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన సర్ఫరాజ్ ఖాన్

యువ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు.

Update: 2024-10-02 15:54 GMT

దిశ, వెబ్ డెస్క్: యువ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. గతంలో ఐపీఎల్ మంచి ఫామ్ కనబరిచిన అతను.. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రి ఇచ్చి, ఫిట్‌నెస్ సమస్య కారణంగా కొద్దిరోజులకే జట్టుకు దూరం అయ్యాడు అనంతరం తిరిగి దేశవాలి మ్యాచుల్లో తన సత్తా చాటుతూ.. కీలకంగా మారుతున్నాడు. ఈ క్రమంలోనే ఇరానీ కప్‌లో ముంబై తరఫున ఆడుతున్న సర్ఫరాజ్.. డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై 276 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్సర్లతో 221 పరుగులు చేశాడు. దీంతో ముంబై తరఫున ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. కాగా ఈ మ్యాచులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి ముంబై జట్టు 536 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు.


Similar News