సంజూ శాంసన్ వీర విధ్వంసం.. 40 బంతుల్లో సెంచరీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ సంజు శంసర్ వీర విహారం చేస్తున్నాడు.

Update: 2024-10-12 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ సంజు శంసర్ వీర విహారం చేస్తున్నాడు. ఏకంగా 40 బంతుల్లో సెంచరీ బాది బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేసి మైదానంలో బౌండరీల మోత మోగించాడు. సంజుకు తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 రన్స్ చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 111 పరుగులు చేసిన తర్వాత ముస్తాఫిజుర్ రెహ్మాన్ చేతిలో శాంసన్ అవుట్ కాగా.. స్కై విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉంది.

కాగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 3వ ఓవర్లోనే అభిషేక్ శర్మ (4) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సంజు శాంసన్.. వన్ డౌన్‌లో వచ్చిన సూర్యతో కలిసి బంగ్లా బౌలింగ్ ఎటాక్‌ను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14.2 ఓవర్లకు 201/2గా ఉంది.


Similar News