SA T20 LEAGUE : దినేష్ కార్తీక్ కు శుభవార్త..

భారతదేశ మాజీ క్రికెటర్, దినేష్ కార్తీక్ కు SA T20 లీగ్ నిర్వాహకులు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

Update: 2024-08-05 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ మాజీ క్రికెటర్, దినేష్ కార్తీక్ కు SA T20 లీగ్ నిర్వాహకులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. తమ లీగ్ బ్రాండ్ అబాసిడర్ గా దినేష్ కార్తీక్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ను ప్రమోట్ చేయడానికి కార్తీక్ కు ఉన్న అనుభవం ఉపయోగపడుతుందని, అతనికున్న అనుభవం దృష్ట్యా అతన్ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. కాగా.. ఈ ఒప్పందం ప్రకారం దినేష్ కార్తీక్ ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ ప్రమోట్ చేయడానికి డీవిలియర్స్ తో కలిసి పని చేస్తారు.

అయితే.. ఈ ఒప్పందం పట్ల కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. గ్రేమ్ స్మిత్ మరియు అతని బృందంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ లీగ్ తొలి రెండు సీజన్ల మ్యాచులు అద్భుతంగా సాగాయని కార్తీక్ అన్నారు . కాగా తమిళనాడుకు చెందిన కార్తీక్ చివరి సారిగా టీంఇండియా తరుపున 2022 టీ20 ప్రపంచ కప్ ఆడాడు. ఇటీవలే దినేష్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అయ్యారు.కార్తీక్ తన చివరి IPL మ్యాచ్ బెంగళూర్ తరుపున రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ఆడాడు.  

Tags:    

Similar News