WTC Final 2023: రోహిత్ శర్మ అరుదైన రికార్డ్.. మూడో భారత ఓపెనర్గా..
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
దిశ, వెబ్డెస్క్: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 13,000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఆసీస్తో జరుగుతున్న WTC Final 2023 మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్మ్యాన్ .. ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఓపెనర్గా ఆన్ని ఫార్మాట్లు కలిపి 295 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 13,031 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఓపెనర్గా 38 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(15,758), ఆ తర్వాత స్ధానంలో సచిన్ టెండూల్కర్ (15,335) ఉన్నాడు.