Rishabh Pant: రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..?
గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
దిశ, వెబ్డెస్క్: గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది (2024) జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికంతా పంత్ ఫిట్గా ఉంటాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన కీలక అధికారి సైతం ధృవీకరించినట్లు ఓ ప్రముఖ వెబ్సైట్ పేర్కొంది.
కాగా, గతేడాది డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్.. ప్రస్తుతం 70 శాతం వరకు కోలుకుని, ఫిట్నెస్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ ఇంకా ప్రారంభించని పంత్ జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. పంత్ వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయానికి కంటే ముందే జట్టుతో చేరతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.