ధోనీ వల్ల రవీంద్ర జడేజా ఇబ్బంది పడ్డాడు: CSK CEO Kasi Viswanathan

చెన్నై సూపర్ కింగ్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చాలా ఇబ్బంది పడ్డాడని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు.

Update: 2023-06-22 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చాలా ఇబ్బంది పడ్డాడని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. ఓ దశలో ధోనీ కంటే ముందు బ్యాటింగ్ చేసేందుకు చాలా భయపడ్డాడని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్‌తో చెన్నై విజయం సాధించింది. చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో జడేజా సూపర్ బ్యాటింగ్‌తో సిక్స్, ఫోర్ బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు.

అయితే ఈ ఇన్నింగ్స్ ముందు వరకు జడేజాను ధోనీ అభిమానులు ఘాటుగా విమర్శించారు. జడేజా సైతం వారి ట్రోలింగ్‌ను తనదైన శైలిలో తిప్పికొడుతూ ట్వీట్ చేశాడు. చివరకు విమర్శించినవారే జడేజాను కొనియాడారు. ధోనీ బ్యాటింగ్ చూసేందుకు జడేజా ఔటవ్వాలని అభిమానులు కోరుకున్నారు. ఈ విషయాన్ని జడేజా సైతం ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా చాలా సార్లు చెప్పాడు. అయితే కొందరు హద్దులు ధాటి విమర్శించడంతో జడేజా సీరియస్ అయ్యాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. ధోనీ అభిమానుల ఓవరాక్షన్ వల్ల జడేజా ఇబ్బందులకు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా, ధోనీ మధ్య విభేదాలున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాశీ విశ్వనాథన్ ఖండించాడు. ఈ సీజన్‌లో చివర్లో 5-10 బంతులు మిగిలి ఉన్నప్పుడు జడ్డూ బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అప్పుడు కూడా ఫ్యాన్స్, ధోనీ ధోనీ. అని అరుస్తుండడంతో అతను చాలా ఫీలయ్యాడు. చాలాసార్లు ఆ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వెళ్లకపోవడమే బెటర్ అని అనుకున్నాడు. అందరికీ ఇలాంటి ఒత్తిడి ఉండటం మామూలే. అయితే ఎవరీపై కూడా జడేజా మాకు ఫిర్యాదు చేయలేదు. ధోనీ పట్ల జడేజాకు అపారమైన గౌరవం ఉంది. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.


Similar News