‘నీ మాటలు ఎవరూ పట్టించుకోరు. ఒక్కసారైనా కప్పు గెలిచావా’.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
టీమ్ ఇండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటాడు.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటాడు. టీ20 వరల్డ్ కప్ విజయంపై అతని కడుపు మంటను బయటపెట్టాడు. పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ను నిర్వాహకులు భారత్కు అనుకూలంగా రూపొందించారని ఆరోపించాడు. తాజాగా మైకేల్ వాన్కు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘నువ్వే ఒక్కసారైనా కప్పు ఎత్తావా?’ అంటూ నిప్పులు చెరిగాడు.
‘మైకేల్ వాన్ ఏది పడితే అది మాట్లాడుతాడు. అతని మాటలను భారత్లో ఎవరూ పట్టించుకోరు. ముందు ఇంగ్లాండ్ టీమ్ను చక్కదిద్దుకో. భారత్తో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ఎందుకు ఓడిపోయిందనే దానిపై అతను దృష్టిపెట్టాలి. భారత్కు ట్రోఫీలు గెలవడం అలవాటు. ఇంగ్లాండ్ రెండు సార్లు గెలిచిందని నాకు తెలుసు. కానీ, భారత్ నాలుసార్లు గెలిచింది. నాకు తెలిసి మైఖేల్ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు. కాబట్టి, మాట్లాడటప్పుడు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి. అతను నా కొలిగ్. అతనికి నా సమాధానం ఇదే.’ అని శాస్త్రి గట్టిగానే బదులిచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్లో ఓటమికి ఈ పొట్టి ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్లో ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.