Ashes 2023: కొత్త మిస్టర్‌ కూల్‌ వచ్చేశాడు.. సెహ్వాగ్‌ ట్వీట్‌ వైరల్‌

Ashes 2023లో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది.

Update: 2023-06-21 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023లో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్స్ స్పందించారు. అందరూ కూడా ఆసీస్ ఆటతీరును తెగ మెచ్చుకున్నారు. అదే సమయంలో ఇంగ్లండ్ వ్యూహాలకు కొందరు మంచి మార్కులు వేశారు. ఈ విజయంపై టీమ్ ఇండియా డాషింగ్ ఓపనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.

'వాట్ ఎ టెస్ట్ మ్యాచ్. ఇటీవల నేను చూసిన బెస్ట్ మ్యాచుల్లో ఇది ఒకటి. అందుకే టెస్టు క్రికెట్ బెస్ట్ క్రికెట్ అనేది. మొదటి రోజు ముగియక ముందే డిక్లేర్ చేయడం నిజంగా ఇంగ్లండ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ముఖ్యంగా వాతావరణాన్ని కూడా పరిగణిస్తే నిజంగా అది చాలా ధైర్యవంతమైన నిర్ణయం' అని మెచ్చుకున్నాడు.

ఆసీస్ జట్టు అద్భుతంగా ఆడిందని సెహ్వాగ్ అన్నాడు. 'ఉస్మాన్ ఖవాజా రెండు ఇన్నింగ్స్‌ల్లో చెలరేగాడు. ఇక ప్యాట్ కమిన్స్.. టెస్టుల్లో కొత్త మిస్టర్ కూల్ అని చెప్పాలి. అంత ఒత్తిడిలో ఎంత అద్భుతంగా ఆడాడు..? లియాన్‌తో అతని భాగస్వామ్యం చాలా కాలం గుర్తుండిపోతుంది' అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.


Similar News