Paris Olympics : క్వార్టర్ ఫైనల్లో ఓడిన భారత మహిళా బాక్సర్

పారిస్ వేదికగా 9వ రోజు జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలలో భారతకు నిరాశ ఎదురయింది.

Update: 2024-08-04 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పారిస్ వేదికగా 9వ రోజు జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలలో భారతకు నిరాశ ఎదురయింది. టోక్యో 2020 కాంస్య పతక విజేత, భారత మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ ,ఈ రోజు జరిగిన క్వార్టర్-ఫైనల్ బౌట్ లో నంబర్ వన్ సీడ్, చైనాకు చెందిన కియాన్‌ చేతిలో 1-4 తేడాతో ఓటమిపాలై రెండో సారి పతకాన్ని గెల్చుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా.. గతేడాది జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో లోవ్లినాను ఓడించిన ఈ చైనీస్ బాక్సర్ ఇప్పుడు మళ్లీ ఆమెపై విజయం సాధించింది.


Similar News