Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట.. ఆర్చరీలో స్వర్ణం గెలిచిన హర్విందర్ సింగ్

పారిస్‌ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్ముదులుపుతున్నారు.

Update: 2024-09-04 20:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్‌(Paris) వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌(Paralympics)లో భారత అథ్లెట్లు దుమ్ముదులుపుతున్నారు. టీం ఇండియా ఇప్పటివరకు 21 మెడల్స్ గెలుచుకోగా తాజాగా మరో మెడల్ భారత్ ఖాతాలో చేరింది.దీంతో ఈ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది.ఇదిలాఉంటే.. బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్(Harvinder Singh) బంగారు పతకం సాధించాడు.ఫైనల్లో పొలాండ్(Poland) అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్‌(Lukasz Ciszek)పై 6-0 తేడాతో ఘన విజయం సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ రికార్డు సృష్టించారు. కాగా, ఒలింపిక్స్ గేమ్స్‌లోనూ ఆర్చరీ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు గోల్డ్ మెడల్ రాలేదు.


Similar News