8వ రౌండ్లో ప్రజ్ఞానంద ఓటమి
నార్వే చెస్ టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తున్న భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 8వ రౌండ్లో ఓటమిపాలయ్యాడు.
దిశ, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేస్తున్న భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద 8వ రౌండ్లో ఓటమిపాలయ్యాడు. వరల్డ్ నం.1 మాగ్నస్ కార్ల్సన్(నార్వే) అతనిపై విజయం సాధించాడు. మూడో రౌండ్లో కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించిన విషయం తెలిసిందే. మొదట 8వ రౌండ్లో క్లాసికల్ గేమ్ను కార్ల్సన్తో కలిసి అతను డ్రా చేసుకున్నాడు. దీంతో ఆర్మగెడాన్ టై బ్రేకర్ను నిర్వహించగా.. అక్కడ ప్రజ్ఞానందను కార్ల్సన్ ఓడించాడు. నల్లపావులతో ఆడిన అతను 67 ఎత్తుల్లో ఓటమిని అంగీకరించాడు. పాయింట్స్ టేబుల్లో కార్ల్సన్(14.5) అగ్రస్థానానికి చేరుకోగా.. ప్రజ్ఞానంద(12) మూడో స్థానంలో ఉన్నాడు. టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా.. ప్రజ్ఞానంద గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. మహిళల విభాగంలో వరుసగా రెండు పరాజయాల తర్వాత ప్రజ్ఞానంద సోదరి ఆర్.వైశాలి తిరిగి పుంజుకుంది. 8వ రౌండ్లో ఆర్మగెడాన్ టై బ్రేకర్లో ఉక్రెయిన్ గ్రాండ్మాస్టర్ అన్నా ముజిచుక్పై విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆమె 11.5 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి(8) నాలుగో స్థానంలో కొనసాగుతోంది.