పునరాగమనం కోసం సిద్ధమవుతున్న షమీ.. ప్రాక్టీస్ మొదలుపెట్టాడు

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాడు.

Update: 2024-07-16 19:22 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. చీల మండల గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అతను పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో అతను ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షమీ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత చీల మండల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా టూరు, ఇంగ్లాండ్‌తో సిరీస్‌తోపాటు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లకు అతను అందుబాటులో లేడు. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న అతను తాజాగా ప్రాక్టీస్ ప్రారంభించాడు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందే అతను దేశవాళీ క్రికెట్‌లో ఆడొచ్చు. 


Similar News