MS Dhoni: ధోనీ బుగ్గపై ముద్దుపెట్టిన స్టార్‌ హీరో.. పిక్స్‌ వైరల్‌

టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీని బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కలిశారు.

Update: 2023-10-05 09:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీని బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ధోనీ బుగ్గపై రణ్‌వీర్‌ ముద్దు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రణ్‌వీర్‌ ఇన్‌స్టా వేదికగా పోస్టు చేశారు. ఈ ఫొటోలకు ‘మేరే మహీ..’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ కూడా మహీని కలిసిన విషయం తెలిసిందే.

బుధవారం ముంబైలో ధోనీని కలిశారు. వీరిద్దరూ ఒక యాడ్ షూట్ కోసం క‌లుసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిస్టర్‌ కూల్‌తో మెగా పవర్‌ స్టార్‌ మీట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మ‌రోవైపు ధోనీ.. కొత్త లుక్‌లో.. చాలా స్టయిలిష్‌ లుక్‌తో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త త‌ర‌హా హెయిర్ స్టయిల్‌తో డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు.యాడ్ షూట్ కోసమే ధోనీ ఇలా కొత్త లుక్‌కు మారినట్లు తెలుస్తోంది.


Similar News