నీరజ్‌ 2018 నుంచి తెలుసు.. ప్రేమ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మను బాకర్

భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా‌తో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలకు స్టార్ షూటర్ మను బాకర్ ఫుల్‌స్టాప్ పెట్టింది.

Update: 2024-08-14 15:30 GMT

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా‌తో ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలకు స్టార్ షూటర్ మను బాకర్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనుతో, ఆమె తల్లితో నీరజ్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో మను, నీరజ్ సిగ్గు పడుతున్నట్టు ఉండటం, మను తల్లి నీరజ్‌తో ఒట్టు వేయించుకున్నట్టు కనిపించడంతో వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు మొదలయ్యాయి. మను బాకర్ తండ్రి కిషన్ బాకర్ ఇప్పటికే ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆ వీడియోపై మను బాకర్ స్పందించింది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను ఆ వీడియో గురించి అడిగారు. ఆమె బదులిస్తూ..‘దాని గురించి నాకు పెద్ద తెలియదు. కానీ, 2018 నుంచి నాకు నీరజ్ తెలుసు. ఈవెంట్ల సమయాల్లో మాత్రమే మాట్లాడుకుంటాం. అది కూడా తక్కువే. అతనితో నాకు పెద్దగా ఇంటరాక్షన్ లేదు. ఇటీవల వస్తున్న రూమర్లలో నిజం లేదు.’ అని మను తెలిపింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ రెండు కాంస్య పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నీరజ్ కూడా జావెలిన్ త్రోలో రజత పతకం దక్కించుకున్నాడు. 

Tags:    

Similar News