Indian football men’s team : ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్గా మనోలో మార్క్వెజ్
భారత పురుషుల ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్గా స్పెయిన్ దిగ్గజ ఫుట్బాలర్ మనోలో మార్క్వెజ్ నియామకమయ్యాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్గా స్పెయిన్ దిగ్గజ ఫుట్బాలర్ మనోలో మార్క్వెజ్ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్(ఏఐఎఫ్ఎఫ్) శనివారం వెల్లడించింది. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత్ రెండో రౌండ్లోనే నిష్ర్కమించిన తర్వాత ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త హెడ్ కోచ్ కోసం కసరత్తు చేసిన ఏఐఎఫ్ఎఫ్ 20 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. శనివారం జరిగిన ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో హెడ్ కోచ్గా మనోలో మార్క్వెజ్ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు.
కోచ్గా మార్క్వెజ్కు చాలా అనుభవం ఉంది. ప్రస్తుతం అతను ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) క్లబ్ గోవాకు హెడ్ కోచ్గా ఉన్నాడు. గోవా క్లబ్తో 2025 వరకు ఒప్పందం ఉంది. గోవా క్లబ్తోపాటు భారత జట్టు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తాడు. గతంలో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్కు మూడు సీజన్లు కోచ్గా ఉన్నాడు. అతని హయాంలోనే హైదరాబాద్ క్లబ్ 2022లో తొలిసారి ఐఎస్ఎల్ టైటిల్ గెలిచింది.