తెలంగాణ కుర్రాడు లోకేశ్ రెడ్డి జోరు.. క్వార్టర్స్‌కు క్వాలిఫై

కయోహ్‌సియుంగ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు కలగొట్ల లోకేశ్ రెడ్డి అదరగొడుతున్నాడు.

Update: 2024-06-20 14:21 GMT

దిశ, స్పోర్ట్స్ : తైవాన్‌లో జరుగుతున్న కయోహ్‌సియుంగ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు కలగొట్ల లోకేశ్ రెడ్డి అదరగొడుతున్నాడు. మెన్స్ సింగిల్స్‌లో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో లోకేశ్ 23-21, 21-10 తేడాతో ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ యూ‌ను చిత్తు చేశాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా లోకేశ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పోరాట పటిమతో ఆ గేమ్‌ను నెగ్గాడు. ఇక, రెండు గేమ్‌లో లోకేశ్ దూకుడు ముందు ఆసిస్ ఆటగాడి వద్ద సమాధానమే లేదు. కేవలం 27 నిమిషాల్లోనే లోకేశ్ మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. క్వార్టర్స్‌లో అతను తనకంటే మెరుగైన ర్యాంక్ కలిగిన చీమ్ జూన్ వీ(మలేషియా)ను ఎదుర్కోనున్నాడు.


Similar News