Asia Cup 2023: పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
ఆసియాకప్-2023లో భాగంగా సూపర్-4లో ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
దిశ, వెబ్డెస్క్: ఆసియాకప్-2023లో భాగంగా సూపర్-4లో ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత అభిమానులకు ఓ గుడ్న్యూస్. తనకు కొడుకు పుట్టిన కారణంగా స్వదేశానికి వెళ్లిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుమ్రా శుక్రవారం భారత జట్టు శిబరంలో చేరినట్లు తెలుస్తోంది.
ఇక ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన రాహుల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఒకవేళ రాహుల్కు తుది జట్టులో చోటు దక్కితే ఇషాన్ కిషన్ గానీ శ్రేయస్ అయ్యర్ గానీ బెంచ్కు పరిమితవ్వాల్సి వస్తుంది.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్