బౌలర్‌గా కీలక మైలురాయిని అందుకున్న బుమ్రా

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అంతర్జాతీయ కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నాడు.

Update: 2024-09-20 19:47 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అంతర్జాతీయ కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్నాడు. 400 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టడంతో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 397 వికెట్లతో ఉన్న బుమ్రా.. ఇప్పుడు 401 వికెట్లకు చేరుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాద్మాన్ ఇస్లాం, ముష్పికర్ రహీమ్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్‌లను పెవిలియన్‌కు పంపాడు. 195 మ్యాచ్‌ల్లో అతను 400 వికెట్ల ఫీట్‌ను చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఘనత సాధించిన 10వ భారత బౌలర్‌గా, 6వ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. పేసర్లలో అతని కంటే ముందు కపిల్ దేవ్(687), జహీర్ ఖాన్(597), శ్రీనాథ్(551), షమీ(448), ఇషాంత్ శర్మ(434) ఈ మైలురాయిని సాధించారు.

Tags:    

Similar News