'ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలిచిన‌ ఐర్లాండ్ క్రికెటర్..

Update: 2023-06-12 13:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్ జట్టు న‌యా సంచ‌ల‌నం హ్యారీ టెక్టర్ అరుదైన ఘ‌నత సాధించాడు. హ్యారీ టెక్టార్‌‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలుచుకున్నాడు. 2023 మే నెల 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌'గా హ్యారీ టెక్టా ఎంపికయ్యాడు. మే నెలలో టెక్టార్‌తో పోలిస్తే బాబర్‌ ప్రదర్శనలే మెరుగ్గా ఉన్నప్పటికీ, అవార్డు టెక్టార్‌నే వరించింది. టెక్టార్‌, బాబర్‌తో పాటు బంగ్లాదేశ్‌ ప్లేయర్ నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో రేసులో ఉండగా.. స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు టెక్టార్‌కే అధిక ఓట్లు వేసి గెలిపించారు.

మహిళల విభాగంలోనూ ఈ అవార్డు విజేతను ప్రకటించగా.. శ్రీలంక ప్లేయర్స్‌ చమారి ఆటపట్టు, హర్షిత మాధవి, థాయ్‌లాండ్‌ క్రికెటర్‌ థిపోట్చా పుత్తవాంగ్‌ ఉండగా.. 19 ఏళ్ల థాయ్‌ క్రికెటర్‌ థిపోట్చా పుత్తవాంగ్‌ను ఈ అవార్డు వరించింది.


Similar News