Women's T20 World Cup: టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్

మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 7వ మ్యాచ్ ఈ రోజు పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Update: 2024-10-06 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 7వ మ్యాచ్ ఈ రోజు పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత మొదట బౌలింగ్ చేయనుంది. అయితే మొదటి మ్యాచ్ లో భారత మహిళల జట్టు 58 పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో భారత మహిళల జట్టుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో గెలిచి ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెప్పేందుకు మహిళల జట్టు సిద్దం అయింది. అలాగే ఈ మ్యాచ్ గెలిచి టాప్ లో నిలిచేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో తెలియాంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, S సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుక ఠాకూర్ సింగ్.

పాకిస్తాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(w), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(c), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్


Similar News