IND Vs IRE T20 : పసికూనతో నేడే తొలి టీ20.. అందరి కళ్లూ అతనిపైనే..
టీమ్ ఇండియా మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది.
దిశ, వెబ్డెస్క్: టీమ్ ఇండియా మరో టీ20 క్రికెట్ సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్తో జరగనున్న మూడు మ్యాచ్ల సిరీస్లో తమ సత్తా చాటేందుకు దూకుడుగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో భాగంగా నేడు తొలి పోరు జరుగనుంది. ఈ క్రమంలో పలువురు యంగ్ ప్లేయర్స్తో పాటు సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. గాయం కారణంగా దాదాపు 11 నెలలుగా మైదానంలోకి అడుగుపెట్టని బుమ్రా ఈ సిరీస్లో టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, జితేశ్ శర్మలు మ్యాచ్కు హైలైట్గా నిలవనున్నారు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్తో పాటు విండీస్ సిరీస్లో చెలరేగిన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మను ఐర్లాండ్ సిరీస్కు ఎంచుకుంది.
విండీస్తో టీ20 సిరీస్ ఓటమి నేపథ్యంలో ఇప్పుడు ఐర్లాండ్ను తేలిగ్గా తీసుకుంటే మరోసారి టీమ్ ఇండియాకు గట్టి దెబ్బ తప్పదు. ఇటీవల 2024 టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించిన ఐర్లాండ్ జట్టు ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్తో పాటు హ్యారీ టెక్టార్, ఆండ్రూ బల్బర్నీ, మార్క్ అడైర్, టకర్, డాక్రెల్, కర్టీస్ కాంఫర్, జోష్ లిటిల్ లాంటి ఆటగాళ్లతో ఆ టీమ్ మెరుగ్గానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆకట్టుకున్న పేసర్ జోష్ లిటిల్.. అంతర్జాతీయ క్రికెట్లోనూ దూసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
భారత్ (అంచనా):
రుతురాజ్, యశస్వి, తిలక్, సంజు శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబె, సుందర్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ;
ఐర్లాండ్ (అంచనా):
బల్బర్నీ, స్టిర్లింగ్, టకర్, టెక్టార్, ఫియాన్ హ్యాండ్, డాక్రెల్, కర్టీస్ కాంఫర్, మార్క్ అడైర్, మెకర్థీ, జోష్ లిటిల్, బెంజమిన్ వైట్.