రెజ్లింగ్ టోర్నీలో అన్షు, అంతిమ్‌లకు రజతం

బుడాపెస్ట్‌ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు అన్షు మాలిక్(57 కేజీలు), అంతిమ్ పంఘల్(53కేజీలు) రజత పతకాలు సాధించారు.

Update: 2024-06-07 20:03 GMT

దిశ, స్పోర్ట్స్ : హంగేరీ జరుగుతున్న బుడాపెస్ట్‌ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్‌ టోర్నీలో భారత మహిళా రెజ్లర్లు అన్షు మాలిక్(57 కేజీలు), అంతిమ్ పంఘల్(53కేజీలు) రజత పతకాలు సాధించారు. శుక్రవారం తమ విభాగాల్లో జరిగిన ఫైనల్‌లో వీరు పరాజయం పాలై సిల్వర్ మెడల్‌తో సరిపెట్టారు. అన్షు 1-12 తేడాతో చైనా రెజ్లర్ హాంగ్ కెక్సిన్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో అంతిమ్‌పై 0-4 తేడాతో జోనా మాల్మ్‌గ్రెన్(స్వీడెన్) విజయం సాధించింది. మరోవైపు, 50 కేజీల కేటగిరీలో వినేశ్ ఫొగట్ క్వార్టర్ ఫైనల్‌లో 0-5 తేడాతో జియాంగ్ ఝూ(చైనా) చేతిలో పరాజయం పాలైంది. శుక్రవారం రెండో పతకాలు దక్కడంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అన్షు, అంతిమ్, వినేశ్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 


Similar News