ప్రధాని మోడీతో భారత జట్టు.. అనంతరం భారీ రోడ్ షో

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జూన్ 29 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు టైటిల్ గెలుచుకుంది.

Update: 2024-07-03 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ లో భాగంగా జూన్ 29 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. అయితే గత నాలుగు రోజులుగా బార్బడోస్ లో భారీ తుఫాను అతలకుతలం చేస్తుంది. ఈ క్రమంలో భారత జట్టు నాలుగు రోజుల నుంచి అక్కడే ఉండిపోయింది. అయితే బుధవారం వాతావరణం అనుకూలించడంతో భారత జట్టు విమానం ఇండియాకు బయలుదేరింది. వీరు గురువారం ఉదయం ముంబై చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో టీ20 చాంపీయన్ జట్టు కలుస్తారు. అనంతరం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేస్తున్న భారీ రోడ్ షో లో ప్లేయర్లు పాల్గొంటారు. ఇదిలా ఉంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత భారత్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీంతో రేపు ముంబై నగరంలో జరిగే రోడ్ షోకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News