వరల్డ్ నెంబర్ వన్గా ‘సుహాస్’
దిశ, స్పోర్ట్స్ : భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బీడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో ఫ్రెంచ్ దిగ్గజం లూకాస్ మజుర్ను వెనక్కినెట్టి వరల్డ్ నెంబర్ వన్గా నిలిచాడు. ప్రస్తుతం సుహాస్ ఖాతాలో 60,527 పాయింట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎస్ఎల్-4 విభాగంలో ప్రపంచ ఛాంపియన్గా అవతరించారు. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.