టీమ్ ఇండియా ర్యాంక్ మళ్లీ డౌన్.. 124వ స్థానానికి పడిపోయిన భారత్
ఫిఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు స్థానం పతనం అవుతూనే ఉంది.
దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు స్థానం పతనం అవుతూనే ఉంది. గురువారం ఫిఫా రిలీజ్ చేసి ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంక్ పడిపోయింది. గత ర్యాంకింగ్స్లో 121వ ర్యాంక్లో ఉన్న జట్టు మూడు స్థానాలను కోల్పోయింది. 1139.39 పాయింట్లతో 124వ స్థానంలో నిలిచింది. ఆసియాలో భారత్ 22వ ర్యాంక్లో ఉన్నది. పాలస్తీనా(15), వియత్నం(20), లెబనాన్(21) జట్లు భారత్ కంటే ముందున్నాయి. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భారత్ వైఫల్యం ర్యాంక్పై ప్రభావం చూపింది. క్వాలిఫయర్స్లో గ్రూపు ఏలో భారత్ మూడో స్థానంతో సరిపెట్టింది. కీలకమైన కువైట్, ఖతార్ మ్యాచ్ల్లో ఓడి మూడో రౌండ్కు చేరుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. గతేడాది జూన్లో టాప్-100లోకి ప్రవేశించిన జట్టు ఆ తర్వాత ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.