ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్

భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు.

Update: 2024-08-06 01:57 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. సోమవారం రాత్రి జరిగిన 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ సెమీ ఫైనల్ మ్యాచులో 8:15.43 నిమిషాల టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచిన ఆయన ఫైనల్ మ్యాచ్‌కి అర్హత సాధించారు. దీంతో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్ లో ఫైనల్ చేరిన మొట్టమొదటి భారత ప్లేయర్ గా ఆయన రికార్డు చరిత్ర సృష్టించారు. మరోపక్క మహిళల 400 మీటర్ల హీట్‌లో కిరణ్ పహల్ ఏడో స్థానంలో నిలిచారు. సెమీ-ఫైనల్ క్వాలిఫికేషన్‌కు రెండో అవకాశాన్ని అందించే రెపెచేజ్ రౌండ్‌లో పహల్‌కు మరో అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News